దుబ్బాకలో టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా చెరుకు శ్రీ‌నివాస్ రెడ్డి..!

Publish Date:Oct 5, 2020

Advertisement

దుబ్బాక ఉపఎన్నికలకు సిద్దమవుతున్న టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ త‌గ‌లింది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ త‌రుపున శ్రీ‌నివాస్ రెడ్డి పోటీ చేయ‌టం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి ముత్యంరెడ్డితో పాటు శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. అయితే నియోజకవర్గంలో త‌న తండ్రి చేసిన మంచి ప‌నుల గురించి గుర్తు చేస్తూ.. నిత్యం కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్న త‌న‌కు టికెట్ కేటాయిస్తే గెలిచి వ‌స్తాన‌ని టీఆర్ఎస్ అధిష్టానాన్ని శ్రీ‌నివాస్ రెడ్డి కోరగా.. టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ నిరాకరించినట్లు తెలుస్తోంది.

 

దీంతో శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో రహస్య మంతనాలు జరిపినట్లుగా సమాచారం. దుబ్బాక అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తే పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెరుకు శ్రీనివాస్ రెడ్డి దామోదరతో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కు మాజీ ఎమ్మెల్యే న‌ర్సారెడ్డి కాంగ్రెస్ తరుఫున దుబ్బాక నుండి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ, స్థానికేత‌రుడు అయినందున ఆయ‌నపై కాంగ్రెస్ పునరాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ‌నివాస్ రెడ్డి చేరిక‌, టికెట్ పై ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా కాంగ్రెస్ నేత‌ల‌తో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ విషయం పై త్వరలోనే కాంగ్రెస్ పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

By
en-us Political News

  
బిఆర్ఎస్  విస్తృత    స్థాయి సమావేశం ఈ నెల 19న తెలంగాణ భవన్ లో జరుగనుంది.  టిఆర్ఎస్ (బిఆర్ ఎస్ )స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా  ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి ఆరు రోజులయ్యిందో లేదో.. జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ పగ్గాలు విజయమ్మకు అప్పగించాలంటూ జగన్ గాలి తీసేశారు.
 పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.వక్ఫ్ సవరణ బిల్లుపై  జెపిసీ ఇచ్చిన  రిపోర్ట్ కు రాజ్యసభ ఆమోదం తెలిసింది.  దీంతో   రాజ్య సభలో గందరగోళం నెలకొంది. జగదాబికా పాల్ నేతృత్వంలోని  జెపిసీ రిపోర్ట్ కు వ్యతిరేకంగా విపక్షాలు  రాజ్య సభలో నిరసనకు దిగాయి.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు వార్త గురువారం (ఫిబ్రవరి 13) ఉదయమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన ముందస్తు బెయిలు కోర్టులో పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్టయ్యారన్న అనుమానాలు వ్యక్తమైనా, గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో కాకుండా మరో కేసులో వల్లభనేని వంశీ అరెస్టయ్యాడని తెలియడంతో ఆ కేసేమిటా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అయ్యింది.
నటుడు మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన సుప్రీం కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. తెలుగు సినీ పరిశ్రమతో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న మోహన్ బాబు ఈ ఐదు దశాబ్దాలలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి వేగం ప్రజలను వణికించేస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అందులోనూ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్రాతి తీవ్రంగా ఉంది. బర్డ్ ఫ్లూ కేవలం కోళ్లు, పక్షులకే కాకుండా మనుషులకూ వ్యాపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కుమార్తె షర్మిలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ద్వారా వైసీపీని దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ పన్నిన వ్యూహం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే వ్యూహాన్ని రివర్స్ లో అమలు చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తనకు బద్ధ విరోధిగా మారిన షర్మిలను దెబ్బకొట్టడంతో పాటు.. రాష్ట్రంలో వైసీపీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కు ఖాళీ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు నాలుగో స్థానంలో  ఉన్నారు.గత ఏడాది ఆగస్టులో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు.
చింతచచ్చినా పులుపు చావదు అన్నట్టు ఉంది వైకాపా పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయినా  వైకాపాకు బుద్దిరాలేదు. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై బుధవారం రాత్రి వైకాపా గూండాలు దాడి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. కోళ్లు, పక్షులే కాకుండా మనుషులకు సైతం సోకుతోంది. బర్డ్ ఫ్లూ చాపకింద నీరులా అతి వేగంగా విస్తరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం టికెట్ పై 2019 ఎన్నికలలో గన్నవరం నుంచి విజయం సాధించి.. ఆ తరువాత వైసీపీలోకి జంప్ చేసిన వల్లభనేని వంశీ.. పార్టీ ఫిరాయించి ఊరుకోలేదు. తెలుగుదేశం నాయకులు, క్యాడర్ లక్ష్యంగా దాడులు చేశారు.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారించనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (ఫిబ్రవరి 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.